న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నది. జనం ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో కేవలం కరోనా సెకండ్ వేవ్ను మాత్రమే కాకుండా భవిష్యత్తులో మూడు, నాలుగు వేవ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
అందువల్ల ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని రాష్ట్రాలకు నితిన్ గడ్కరీ సూచించారు. దేశ ప్రజానీకమంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక ప్రజలు వైరస్ గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధాల కొరతను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రెమ్డెసివిర్కు పెరుగుతున్న డిమాండ్ రీత్యా వార్ధాలో 30 వేల డోస్ల ఉత్పత్తిని పెంచనున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్లో రెండు కేంద్రాలు..!
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో