సిద్దిపేట, మే10 : సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న వారికి సిద్దిపేట అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వారికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో చిన్నకోడూరు మండలం ఆనంత్ సాగర్, చర్ల అంకి రెడ్డి పల్లి చెందిన బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో(BRS) చేరారు. వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మాట్లాడుతూ సిద్దిపేటను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపింది బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
కాంగ్రెస్ వచ్చాకే కరువు వచ్చింది కష్టాలు మొదలయ్యన్నారు. యువతకి ఇస్తానన్న నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నారు. యువత కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని, యువకులు ఆ పార్టీల కుట్రలను తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.