లండన్: కరోనా టీకాల పనితనానికి సంబంధించి ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. టీకాలు కరోనా వైరస్ నుంచి రక్షించడం మాత్రమే కాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఒక డోసు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మహమ్మారి బారినపడితే వారి నుంచి కుటుంబసభ్యులకు వైరస్ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనిపెట్టారు.
ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (PHE) పరిశోధకులు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత మహమ్మారి బారినపడిన వారి నుంచి టీకా తీసుకోని కుటుంబసభ్యులకు వైరస్ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు గుర్తించారు. దాంతో కొవిడ్ టీకా వైరస్ బారి నుంచి రక్షించడమే కాకుండా, వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైంది.
మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్కాక్ వెల్లడించారు. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన 24 వేల మంది కుటుంబాల్లో వ్యాక్సిన్ తీసుకోని 57 వేల మందిపై అధ్యయనం జరిపారు. ఈ ఫలితాలను 10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోని వారి సమాచారంతో పోల్చిచూడగా తాజా విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా అధ్యయనం బ్రిటన్లో వ్యాక్సినేషన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లు తేల్చింది. మార్చి చివరి నాటికి 60 ఏండ్ల పైబడిన వారిలో 10,400 మరణాలను నియంత్రించగలిగినట్లు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో