చెన్నై: కొత్త కారుకు గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం అదుపుతప్పిన ఆ కారు ఆలయంలోని స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. (New car Damaged after Puja) అయితే కొత్త కారుకు పూజ చేసిన యజమాని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుధాకరన్ అనే వ్యక్తి కొత్తగా కారు కొనుగోలు చేశాడు. శ్రీముష్ణం ప్రాంతంలోని ఆలయంలో ఆ వాహనానికి పూజలు చేయించాడు.
కాగా, డ్రైవింగ్ సీటులో ఉన్న సుధాకర్ బయట ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. పూజల తర్వాత కాస్త ముందుకు కారును నడిపేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే బ్రేకులు వేయబోయి యాక్సిలేటర్ను నొక్కడంతో కారు అదుపుతప్పింది. గుడి మెట్ల మీదుగా ముందుకు దూసుకెళ్లింది. కారును కంట్రోల్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
మరోవైపు ఆలయం ప్రాంగణంలోని ఒక స్తంభాన్ని కారు ఢీకొట్టింది. దీంతో దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు యజమాని సుధాకరన్ మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ముందు భాగం ధ్వంసమైన కొత్త కారును పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ఆలయంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A man inadvertently crashed his newly purchased car into a pillar-like structure after a blessing ceremony at a temple in the Srimushnam area of Cuddalore district. #car #temple #crash #puja #TamilNadu pic.twitter.com/zPPQVTmDdt
— IndiaToday (@IndiaToday) May 8, 2024