Vinod Kumar | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో రైతుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
సాయంత్రం జరిగే కేబినెట్లోనైనా రైతుల గురించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం. రైతుబంధు పథకం గురించి చర్చించాలి. ప్రధానితో సహా చాలా మంది రైతుబంధు పథకాన్ని స్వాగతించారు. పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి రైతుబంధు అని పేర్కొన్నారు. పంట కోతల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదు. రైతుభరోసా అమలు చేసి ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలి. రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
వరి పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలి. బోనస్ను బోగస్గా మార్చకండి. నిన్న బీఆర్ఎస్ చేసిన నిరసనలకు మంచి స్పందన వచ్చింది. బోనస్, మద్దతు ధర విషయంలో రేవంత్ రెడ్డి మాట తప్పారు. మీరు ముందే చెబితే డిపాజిట్ కూడా రాకపోవు. అకాల వర్షాలతో ధాన్యం తడిసింది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి. రైతుల క్వింటాల్ ధాన్యం రూ. 1800కే అమ్ముకుంటున్నారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.