అమరావతి : అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో ఏపీ సీఎం జగన్(CM Jagan) ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కూటమి నీతి, నిజాయితీతో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu) పేర్కొన్నారు. తిరుపతి గన్నవరంలో కూటమి తరుఫున నిర్వహించిన ఎన్నికల(Elections) ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గన్నవరం(Gannavaram) లో భారీ వర్షం కురుస్తున్నా వర్షంలోనే బాబు ప్రసంగాన్ని కొనసాగించారు. ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ప్రజల ఆస్తులను జగన్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలో వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులను లోబర్చుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించగా అడ్డుకుని తిప్పిపంపారని, బ్యాలెట్ పోలింగ్(Ballot Polling) లో నూటికి 90 శాతం మంది ఉద్యోగులు కూటమికే ఓట్లు వేశారని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగస్థులను అభినందించారు.
కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. హలో ఏపీ అంటే.. బైబై జగన్ అంటూ నినాదాలు చేయించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలను వీరోచితంగా పోరాడుతున్న యార్లగడ్డ వేంకట్రావుకు భవిష్యత్లో సముచిత గౌరవం ఇస్తానని పేర్కొన్నారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని భరోసా ఇచ్చారు.