న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగిత రేటు క్రమంగా డబుల్ డిజిట్స్ దిశగా పరుగులు తీస్తున్నది. భారత్లో ఇది కొత్త కాదు కానీ.. గతేడాది కరోనాను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు లాక్డౌన్ అమలు చేసినప్పుడు కూడా డబుల్ డిజిట్స్ అన్ఎంప్లాయిమెంట్ నమోదైంది.
ఈ నెల 23వ తేదీతో ముగిసిన వారానికి నిరుద్యోగిత 14.7 శాతానికి చేరుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. గతేడాది మాదిరిగా పూర్తిస్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు కాకున్నా.. రవాణాపై ఆంక్షలు విధించడం ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది.
ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి నిరుద్యోగిత 8.7 శాతానికి, 16వ తేదీతో ముగిసిన వారానికి 14.3 శాతానికి పెరిగింది. కానీ, గత నెలలో అది 7.97 శాతమే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ నిరుద్యోగిత పెరిగిందని సీఎంఐఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
సాధారణంగా గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుతున్నది. 30 రోజుల ప్రకారం ఈ నెల ఆరో తేదీ నాటికి సగటున నిరుద్యోగిత 10.2 శాతానికి చేరింది. ఇది నికరంగా పెరుగుతూ వచ్చింది.
మే 20 నాటికి 12 శాతం, 23 నాటికి 12.7 శాతంగా నమోదైందని సీఎంఐఈ వెల్లడించింది. అధిక సంఖ్యలో కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం వల్లే నిరుద్యోగిత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?
ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం పదిలం
వ్యాక్సినేషన్ తోనే ఎకానమీపై మహమ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ
వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!
హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ప్రధాని పర్యటన
ఐటీ కొత్త రూల్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ సంస్థ
మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
నన్నెవరూ అరెస్ట్ చేయలేరు : రాందేవ్ బాబా
యాంటీబాడీ కాక్టెయిల్ ట్రయల్స్కు జైడస్ దరఖాస్తు
భారతీయ ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నాం : గూగుల్ సీఈవో
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు