న్యూఢిల్లీ: కరోన్ రెండో వేవ్ దూసుకెళ్లకముందు ఈ ఏడాది భారీగా పెద్ద ఇండ్ల విక్రయాలు సాగాయి. ఏడు ప్రధాన సిటీల్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రెక్కలొచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మూడు బెడ్రూమ్ల ఇండ్ల విక్రయాలు 19 శాతం పెరిగాయి.
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 30,169 ట్రిపుల్ బెడ్ రూమ్ ఇండ్లు అమ్ముడయ్యాయి. ఇదే గతేడాది అంటే 2019-20లో 25,307 పెద్ద ఇండ్ల కొనుగోళ్లు జరిగాయి. వర్క్ ఫ్రం హోం విధానం పెరగడంతో చాలా మంది పని చేస్తున్నప్పుడు పర్సనల్ స్పేస్ కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయంతో చాలా మంది ఉద్యోగులు, కార్మికులు అతిపెద్ద ఇండ్లలో జీవించడానికి మొగ్గు చూపుతున్నారని రియాల్టీ డేటా రీసెర్చ్ అనలిటిక్స్ ఫర్మ్ ప్రాప్ఈక్విటీ నివేదించింది.
దీనికి తోడు కేంద్ర, రాష్ట్రాల ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఇండ్ల నుంచి పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్) సంస్క్రుతి పెరగడం కూడా దీనికి కారణం అని తేలింది.
పెద్ద ఇండ్లకు డిమాండ్ పెరిగిపోవడంతో డెవలపర్లు కూడా చిన్న ఇండ్ల నిర్మాణాన్ని పక్కన బెట్టేశారు. గతేడాది (2019-20) జనవరి- మార్చి త్రైమాసికంలో 29,836 ఇండ్లు అందుబాటులో ఉంటే, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో అది 20,848 ఇండ్లకు పరిమితమైంది.
బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), పుణెల్లో ఇండ్ల విక్రయాలు పెరిగాయి. ఇందులో ముంబైలోనే పెద్ద ఇండ్ల విక్రయాలు 54 శాతం ఎక్కువయ్యాయి.
తర్వాతీ స్థానంలో 43 శాతం పెరుగుదలతో చెన్నై, 34 శాతంతో పుణె, 14%తో హైదరాబాద్, 13%తో ఎన్సీఆర్, 10 శాతంతో బెంగళూర్ నిలిచాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మాత్రమే పెద్ద ఇండ్ల కొనుగోళ్లు 12 శాతం తగ్గడం ఆసక్తికర పరిణామం.
18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వారికి వ్యాక్సినేషన్ పూర్తయితే దేశంలో పెద్ద ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతాయని ప్రాప్ఈక్విటీ ఫౌండర్ కం ఎండీ సమీర్ జసౌజా చెప్పారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని గుర్తు చేశారు.
కనుక వర్క్ ఫ్రం హోం వ్యవస్థ మరికొంత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమీర్ జసౌజా తెలిపారు. ప్రాపర్టీ మార్కెట్లో సాధారణ లావాదేవీలు క్రమంగా గాడిలో పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతేడాది తొలి లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోంలో భాగస్వాములైన వారిలో పెద్ద ఇండ్ల కోసం డిమాండ్ పెరిగిందని అంబియెన్స్ గ్రూప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ అంకుశ్ కౌల్ తెలిపారు.
ఇంటి వద్ద నుంచే స్కూలింగ్ కూడా సాగుతుండటంతో తల్లిదండ్రులు తమకు పర్సనల్ స్పేస్ కావాలని భావిస్తున్నారన్నారు. పెద్ద ఇండ్లలో.. వర్క్ ఫ్రం హోం కోసం విడిగా గది కావాలన్న డిమాండ్ కూడా పెరిగిందని అంకుశ్ కౌల్ చెప్పారు.
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి