ముంబై, జూన్ 1: లక్షమందికి ఉచిత కొవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రూ.8 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలిపింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం తమవంతుగా ఛారిటీ సంస్థలు, ఆసుపత్రుల సహకారంతో ఉచిత కొవిడ్ టీకాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎంపీ అహమ్మద్ చెప్పారు.