కరోనా సెకండ్ వేవ్ వలన అన్ని సినిమాల షూటింగ్స్కు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు కూడా బ్రేక్ పడింది. జూలై తర్వాత కరోనా ఎఫెక్ట్ తగ్గుతుందని అందరు భావిస్తుండగా, మేకర్స్ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించగా, వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
సర్కారు వారి పాట సినిమా జులై నుండి షూటింగ్ ప్రారంభం చేయనున్నట్లు టాక్. ఈ సినిమాలో మహేష్ పూర్తిగా న్యూ లుక్ లో కనిపించనున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మైత్రి మేకర్స్ – 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి మహేష్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే 31న చిత్రం నుండి అప్డేట్ వస్తుందని భావించారు. కాని అభిమానులకు నిరాశే మిగిలింది.