చందంపేట, ఆగస్టు 01 : నల్లగొండ జిల్లా చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన చిలకల జైరాం (తండ్రి : చిలకల గోవిందు) ప్రభుత్వ రంగంలో వరుసగా రెండు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. జైరాం మొదటగా 2026 ఏప్రిల్ 24న నాగర్కర్నూల్ జిల్లా కోర్టు పరిధిలోని జిల్లా న్యాయ సేవా సంస్థ (District Legal Services Authority) లో స్టెనోగ్రాఫర్గా ఎంపికయ్యాడు. తదనంతరం 2026 జూలై 29న మహబూబాబాద్ జిల్లా కోర్టు పరిధిలోని జిల్లా న్యాయ సేవా సంస్థ (District Legal Services Authority)లో కూడా స్టెనోగ్రాఫర్గా మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. రేకులగడ్డ గ్రామం నుండి ప్రభుత్వం ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తిగా జైరాం నిలిచినట్లు గ్రామస్తులు తెలిపారు.