హైదరాబాద్ శివారు శంషాబాద్లోని ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కిషన్గూడలోని సెవెన్హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్ను తప్పించబోయి.. పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో హోటల్లో టీ తాగుతున్న వ్యక్తి మృతిచెందాడు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుడిని కరీంనగర్ వాసి అజ్మల్గా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి.
శంషాబాద్లో ట్రావెల్స్ బస్సు బీభత్సం
అదుపుతప్పిన కంటైనర్ను తప్పించబోయి పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్లోకి దూసుకెళ్లిన సెవెన్ హిల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రమాదంలో హోటల్లో టీ తాగుతున్న వ్యక్తి మృతి, మరో 50 మందికిపైగా గాయాలు pic.twitter.com/WLlV4Qw7g4
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2026