న్యూఢిల్లీ: టెలికం సంచలనం రిలయన్స్ జియో రెండు నెలల తర్వాత తిరిగి పట్టు సాధించింది. ఏప్రిల్ నెలలో కొత్త సబ్స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో ఆధికత్య సాధించింది. కానీ వొడాఫోన్ ఐడియా మాత్రం 18 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
ఏప్రిల్ నెలలో రిలయన్స్ జియో అదనంగా 48 లక్షల సబ్స్క్రైబర్లను తన ఖాతాలో చేర్చుకుంది. కానీ దాని ప్రత్యర్థి సంస్థ ఎయిర్టెల్ ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లను మాత్రమే పొందిందని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సోమవారం తెలిపింది.
వైర్లెస్ సబ్స్క్రైబర్ల జాబితాలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని జియో 427.67 మిలియన్ల యూజర్లతో టాప్లో నిలిచింది. తర్వాతీ స్థానంలో ఉన్న భారతీ ఎయిర్టెల్ 352.91 మిలియన్లు కాగా, వొడాఫోన్ ఐడియా 281.90 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది.
గత ఏప్రిల్లో వైర్లెస్ సబ్స్క్రైబర్లలో జియో మార్కెట్ షేర్ 36.15 శాతం పెరిగింది. ఎయిర్టెల్ 29.83 శాతం, వొడాఫోన్ ఐడియా 23.83 శాతం యూజర్లను కలిగి ఉన్నాయి.
అయితే, జియో సబ్స్క్రైబర్లు 92.5 మిలియన్ల మంది ఇన్ యాక్టివ్ కావడం ఇబ్బందికరమే. ఇది మొత్తం సబ్స్క్రైబర్ బేస్లో 21.63 శాతం.
ఎయిర్టెల్ అత్యధికంగా 98.31 శాతం యాక్టివ్ సబ్స్క్రైబర్ల నిష్పత్తి కలిగి ఉండగా, వొడాఫోన్ 89.87 శాతం కలిగి ఉన్నాయని ట్రాయ్ డేటా తెలిపింది.
ఇక ఫిక్స్డ్ వైర్లైన్ సెగ్మెంట్లో జియో టాప్ గెయినర్గా నిలిచింది. కొత్త కనెక్షన్లలో జియోకు 1,94,800 సబ్స్క్రైబర్లు జత కలిశారు. ఎయిర్టెల్ కేవలం 59,305 మంది యూజర్లను మాత్రమే పొందగలిగింది.
కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. అదీ త్వరలోనే: ఇండియన్ మెడికల్ అసోసియేషన్
నార్కో టెర్రర్ను ఆపాలి: అమిత్ షా
కశ్మీర్ను లూటీ చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు
నిబంధనలు పాటించని ఫలితం.. జన్పథ్ మార్కెట్ మూసివేత
లఢాక్లో చొరబడిన చైనా సైనికులు.. దలైలామా బర్త్డే వేడుకలపై నిరసన
అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం: శిరీష బండ్ల
భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం చైన్ స్నాచర్గా మారిన భర్త..!
గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అంకితం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాలమూరు మహిళలు
వీడియో: స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించిన చిరుత
వరిగడ్డితో చెప్పుల తయారీ.. ఎక్కడో తెలుసా?
తమిళనాడును విభజించే యోచనలేదు: బీజేపీ
సెప్టెంబర్ 12న నీట్ (యూజీ) పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ