ముంబై: ఒక చిరుతపులి స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించింది. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తకాలి ధోకేశ్వర్ గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయ క్యాంటీన్లోకి ఇటీవల ఒక చిరుతపులి ప్రవేశించింది. గమనించిన స్కూల్ సిబ్బంది క్యాంటీన్ డోర్ మూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ స్కూల్కు వచ్చిన అటవీ శాఖ సిబ్బంది చిరుతను బంధించేందుకు నాలుగు గంటలపాటు శ్రమపడ్డారు. అది తప్పించుకోకుండా అన్ని మార్గాలను మూసివేశారు.
క్యాంటీన్ లోపల ఉన్న చిరుత అటూ ఇటూ తిరుగడంతో దానిని ఎలా పట్టుకోవాలో అటవీ శాఖ సిబ్బందికి అర్థం కాలేదు. చివరకు వంటగది డోర్కు చిన్న రంధ్రం చేశారు. అక్కడి నుంచి గురిపెట్టి తుపాకీతో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. స్వల్ప గాయాలైన చిరుతను ఎట్టకేలకు అటవీ శాఖ సిబ్బంది బంధించారు. జున్నార్లోని మణిక్డో చిరుత పులుల రెస్క్యూ సెంటర్కు తరలించి చికిత్స అందించారు. కాగా, ఈ చిరుతను బంధించిన వీడియోను వైల్ట్లైఫ్ శాఖ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.