న్యూఢిల్లీ: లఢాక్లోని డెమ్చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని కనిపించారు. అక్కడి భారతీయ గ్రామాల్లోని ప్రజలు దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ వాళ్లు ఇలా చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది. వీళ్లంతా ఐదు వాహనాల్లో వచ్చి గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఇలా నిరసన తెలిపారు.
గ్రామస్థులు ఆ ప్రాంతంలో దలైలామా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడమే దీనికి కారణం. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ కూడా 86వ పుట్టిన రోజు జరుపుకుంటున్న దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దలైలామాతో మాట్లాడినట్లు మోదీ పబ్లిగ్గా అంగీకరించడం ఇదే తొలిసారి.