మహబూబ్నగర్ : పాలమూరు మహిళలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల విత్తన బంతులు తయారు చేశారు. అంతే కాకుండా సీడ్ బాల్స్ తో అతి పెద్ద సెంటెన్స్ తయారు చేసి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించారు. జిల్లా కేంద్రం రైల్వే కమ్యూనిటీ హాల్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్..లార్జెస్ట్ సీడ్ బాల్ సెంటెన్స్ కార్యక్రమం జరిగింది. ఇందులో మహిళలు తయారు చేసిన సీడ్ బాల్స్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు కల్పిస్తూ ఆ సంస్థ ప్రతినిధి రిషి నాథ్ అధికారికంగా ధృవీకరించారు.
కేవలం 10 రోజుల్లో లక్షా 24 వేల మంది మహిళలు 2కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి వరల్డ్ రికార్డు సాధించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బోయినపల్లి సంతోష్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, పాలమూరు మహిళా సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జంపన్న వాగులో ఇద్దరు యువకుల గల్లంతు
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు