నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన వార్డు మెంబర్ రాజేష్, బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి హరీష్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత టీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమన్నారు.
యువతలో మార్పు బాల్కొండ నుంచే ప్రారంభం అయిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్వేషాలు, సోషల్ మీడియా అబద్ధాల ప్రచారాల మధ్య నుంచి అభివృద్ధి వైపు రావడం మీరు తీసుకున్న గొప్ప నిర్ణయమని వారిని ప్రశంసించారు. మీరిచ్చే బలంతో నేను మరింత ఉత్సహంతో పనిచేస్తా అన్నారు. యువత సోషల్ మీడియాలో వచ్చే సెన్సేషన్ కి ఆకర్షితులు అవుతున్నారు. అదే నిజం అనేలా యువతను మాయమాటలతో నమ్మిస్తున్నారు.
అభివృద్ధి పనులు, మంచి చేసే పనులు సోషల్ మీడియాలో ప్రచారం కావన్నారు. అభివృద్ధి విషయాలు వైరల్ కావడం లేదు. దాని నుంచి యువత బయటకు రావాలని పిలుపునిచ్చారు.
బండి సంజయ్, రేవంత్ రెడ్డి, అర్వింద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు.
నేను హిందువునే. ఎంపీ అర్వింద్ హిందువే. నేను 31 గుడులు కట్టించిన. నీవు ఒక్క గుడి అయిన కట్టించినవా అర్వింద్ అని సూటిగా ప్రశ్నించారు. జై శ్రీరాం అని హృదయం లోంచి రావాలి. ఊరికే మాట్లాడడం కాదని హితవు పలికారు. యువత సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ