మహబూబ్నగర్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన మహిళా సమాఖ్యకు చెందిన మహిళలు 10 రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేశారు. వాటిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లోని మైదాన ప్రాంతాల్లో వెద జల్లే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిలుగా పాల్గొని విజయవంతం చేశారు.
ఈ రికార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అంకితం ఇస్తునట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కృషి చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, గ్రీన్ ఇండియా ప్రతినిధులు రాఘవ, వెంకటేష్, డీఎఫ్వో గంగిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు