ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎదుగుదలకు, శక్తిమంతమైన బ్యాలెన్స్ షీట్, అధిక ద్రవ్య లభ్యత ఉందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. జియో, రిటైల్, ఆయిల్ టూ కెమికల్ రంగాలు తమ సంస్థకు ఉన్న హైపర్ గ్రోత్ ఇంజిన్స్ అని బుధవారం విడుదల చేసిన రిలయన్స్ వార్షిక నివేదికలో తెలిపారు.
ఈ మూడు రంగాల పురోభివ్రుద్ధికి అవసరమైన ప్రణాళికలకు తమ సంస్థ బ్యాలెన్స్ షీట్, అధిక ద్రవ్య లభ్యత మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. జియో ప్లాట్ఫామ్స్లో తమ కంపెనీ మైనారిటీ వాటాలను విక్రయించినట్లు తెలిపారు.
టెలికం, డిజిటల్ బిజినెస్, రిటైల్ రంగాలు దాదాపు రూ.2 లక్షల కోట్లు, రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ.53,124 కోట్ల నిధులు సేకరించినట్లు వెల్లడించారు. రైట్స్ ఇష్యూ ద్వారా రిలయన్స్ 1.59 రెట్లు నిధులు పొందింది. దేశంలోనే గత పదేండ్లలో ఇదే అతిపెద్ద రైట్స్ ఇష్యూగా రికార్డయింది.
గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ రూ.1,52,056 కోట్లు, రిలయన్స్ రిటైల్ రూ.47,265 కోట్లు సేకరించినట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. వీటిల్లో వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లతోపాటు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, సెర్చింజన్ గూగుల్ పెట్టుబడులు పెట్టాయి.
ఫ్యూయల్ రిటైలింగ్ బిజినెస్లో 49 శాతం వాటా కొనుగోలు చేయడానికి బీపీ సంస్థ రూ.7,629 కోట్ల నిధులు పెట్టుబడి పెట్టింది. ఈ రంగాల్లో ఇతర సంస్థల పెట్టుబడులతో నిర్ణీత గడువులోగా రుణ రహిత సంస్థగా రిలయన్స్ ఎదిగింది.
దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి
ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే
22 కోట్ల కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్న ముంబై కంపెనీ
మరో వైరస్ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు గర్తింపు
అంబులెన్సుల దందా.. 40 కి.మీటర్లకు రూ.17 వేలు
న్యూయార్క్ కన్నా ముంబైలో రెట్టింపు!
రాందేవ్ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ
ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్స్ లైవ్..
నో డౌట్: ఇప్పట్లో లీటర్ పెట్రోల్ రూ.100 తగ్గదు..!!
విదేశీ వ్యాక్సిన్లకు ఆ రక్షణ కల్పించడానికి సిద్ధం!
పాక్తో కలిసి వాస్తవాధీన రేఖ వద్ద మిస్సైళ్లను పరీక్షిస్తున్న చైనా
పాకిస్థాన్లో మ్యూజియాలుగా రాజ్కపూర్, దిలీప్కుమార్ ఇళ్లు
అతిపెద్ద మాంస విక్రయ సంస్థపై సైబర్ దాడి..
ఆ ఒక్క కరోనా వేరియంటే ఆందోళన కలిగిస్తోంది: డబ్ల్యూహెచ్వో