న్యూఢిల్లీ, జూన్ 1: కరోనా రోగుల చికిత్స కోసం తీసుకొచ్చిన 2-డీజీ (2 డీఆక్సీ-డీ-గ్లూకోజ్) ఔషధాన్ని గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. 18 ఏండ్లలోపువారూ వినియోగించవద్దని సూచించింది. ఈ మేరకు ఔషధ వినియోగంపై మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ ఔషధాన్ని వాడాలని సూచించింది.ఈ ఔషధ సరఫరా కోసం రోగులు, వైద్య సిబ్బంది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ను సంప్రదించొచ్చని డీఆర్డీవో వెల్లడించింది. పొడి రూపంలో ఉండే ఈ మందును నీళ్లలో కలుపుకుని తాగాలి. ఈ ఔషధం ఒక్కో సాచెట్ ధరను డాక్టర్ రెడ్డీస్ రూ. 990గా నిర్ణయించిన విషయం విదితమే.
తీవ్ర లక్షణాల వారికి 10 రోజుల్లో ఈ డ్రగ్ సూచించాలి
2-డీజీ వాడకానికి మార్గదర్శకాలివే..