నాంపల్లి, ఆగస్టు 07 : నాంపల్లి మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన తెలగమల్ల మురళి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం జిల్లా ఉన్నత పాఠశాలలో అతడితో పాటు చదువుకున్న విద్యార్థులు మురళి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మురళికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ అస్లం, మారెపాక అంబేద్కర్, నక్క శ్రీనివాసులు, జెల్లా భిక్షం, దాసరి రమేశ్, ఎస్కే అక్బర్, బొడ్డు వెంకన్న పాల్గొన్నారు.