ముంబై, 1 జూన్: భారతదేశంలోని ఫుట్బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్ (ఎస్పీఎస్ఎన్) లో రెండు అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లైన UEFA యూరో 2020 ,కోపా అమెరికా 2021 లతో అతిపెద్ద ఫుట్బాల్ ఫెస్టివల్ను అసమానమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి నిబద్దతతో ఉన్న సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్ గ్లోబల్ మార్క్యూ ఈవెంట్లను భారతదేశంలోని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టోర్నమెంట్ల కోసం అనేక రకాల కార్యక్రమాలను ప్రకటించింది.
ఆరు భాషల్లో ప్రసారం.. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళంలలో ప్రసారం చేస్తుంది. 11 జూన్, 2021 నుంచి యూరప్లోని 11 నగరాల్లో ప్రసారం కానున్న UEFA యూరో 2020, 24 ఉత్తమ టీమ్స్ ఉన్నాయి. అలాగే అభిమానులు అన్ని ఉత్కంఠభరితమైన ఆటలను SONY TEN 2, SONY TEN 3, SONY SIX , SONY TEN 4 చానెల్లతో పాటు SonyLIVE లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
క్రీడా అభిమానులు కోపా అమెరికా 2021 జట్టు ఆటను కూడా 14 జూన్, 2021 నుంచి వీక్షించవచ్చు, ఇందులో పాల్గొంటున్న 10 దేశాల నుంచి ప్రముఖ టాప్ ఫుట్బాల్ క్రీడాకారులు లియోనెల్ మెస్సీ, నేమార్ జూనియర్, డాని అల్వెస్, గాబ్రియేల్ జీసస్, అలిసన్ బెకర్, జేమ్స్ రోడ్రిగెజ్, రాబర్టో ఫిర్మినో, పాలో డైబాలా, సెర్గియో అగ్యురో ,మరెందరో ఉన్నారు. కోపా అమెరికా… ఇంగ్లీష్, బెంగాలీ, తమిళం, తెలుగు , మలయాళంలలో అలాగే SONY TEN 1, SONY TEN 2, SONY SIX , SONY TEN 4 చానెళ్లలో ప్రసారమవుతుంది.