ముంబై : భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేసేందుకు మహారాష్ట్రకు చెందిన హాఫ్కైన్ ఫార్మా సంస్థకు అనుమతి దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు హెచ్బీపీసీఎల్ సంస్థ పేర్కొన్నది. కోవాగ్జిన్ ఉత్పత్తికి అనుమతి దక్కిన నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని, రాబోయే 8 నెలల్లోగా ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ కంపెనీ ఎండీ సందీప్ రాథోడ్ తెలిపారు. ముంబైలో ఉన్న ల్యాబ్లోనే ఏడాదికి సుమారు 22 కోట్ల డోసులను హాఫ్కైన్ ఫార్మా సంస్థ ఉత్పత్తి చేయనున్నది. తమకు సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం 93 కోట్లు నిధులను విడుదల చేసిందని, కేంద్రం కూడా 65 కోట్లు ఇవ్వనున్నదని ఎండీ రాథోడ్ తెలిపారు. ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని అనుకూలంగా ఉన్నాయని, నిర్ణీత సమయంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతందని, ప్రతి నెలా సుమారు రెండు కోట్ల డోసులును ఉత్పత్తి చేసే సామర్థ్యం తమ కంపెనీ ఉన్నట్లు ఎండీ రాథోడ్ వెల్లడించారు.