న్యూఢిల్లీ: ‘భారత్ను కోవిండ్ నుంచి కాపాడండి.. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వండి.’ ఇది కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందేశం. వీడియో రూపంలో ఈ సందేశాన్ని రూపొందించి విడుదల చేశారు. సంవత్సరాంతంలోగా దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు వేస్తామని కేంద్రం అట్టహాసంగా చేస్తున్న ప్రకటనలను ఆయన దుయ్యబట్టారు. టీకాలు అందుబాటులో లేనప్పుడు ఎలా వేస్తారని ఆయన నిలదీశారు. “రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు, ఇతరులు వేరువేరు ధరలు పెట్టి టీకాలు కొనాలని కేంద్రం అనడం ఆమోదయోగ్యం కాదు. తక్కువప ధరకు టీకాలు కొనే అవకాశం కేంద్రానికి ఉంది. కనుక కేంద్రమే కొని దేశ ప్రజలు అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలి. టీకాల కార్యక్రమం ప్రారంభంలో ప్రభుత్వ విధానం కూడా ఇదే” అని థరూర్ అన్నారు. “దేశాన్ని కోవిడ్ నుంచి కాపాడేందుకు సార్వత్రిక, ఉచిత టీకాల పంపిణీ చేపడదాం.. నేను బాధలో, నాకన్నా మించి ఇతరులు పడ్డ బాధల్లో లేశమంత కూడా ఇతరులు అనుభవించాలని అనుకోవడం లేదు” అన్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>My message from my Covid sickbed: <a href=”https://twitter.com/hashtag/SpeakUpForFreeUniversalVaccination?src=hash&ref_src=twsrc%5Etfw”>#SpeakUpForFreeUniversalVaccination</a> <a href=”https://t.co/JjKmV5Rk71″>pic.twitter.com/JjKmV5Rk71</a></p>— Shashi Tharoor (@ShashiTharoor) <a href=”https://twitter.com/ShashiTharoor/status/1399905861305192453?ref_src=twsrc%5Etfw”>June 2, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>