న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత దేశంలో కార్ల విక్రయాలు పుంజుకోవడానికి ప్రీ-మహమ్మారి స్థాయికి చేరుకోవడానికి రెండేండ్లు పడుతుందని ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగడం వల్ల ఆటోమొబైల్ రంగ రికవరీపై ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది.
కరోనా మహమ్మారి ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో, 2019లో ఆర్థిక మంద గమనం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు 27 లక్షల యూనిట్లకు పడిపోయాయి. ఇది ఆరేండ్ల కనిష్టం. 2019-20లో అది 34 లక్షల యూనిట్లు.
2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఆటోమొబైల్ రంగ, ప్రత్యేకించి కార్ల విక్రయాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అనీశ్ షా వ్యాఖ్యానించారు. అప్పటికల్లా దేశ జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
అందరికీ వ్యాక్సినేషన్పైనే ఎకానమీ రికవరీ ఆధార పడి ఉంటుందన్నారు అనీశ్ షా. కరోనా మూడో వేవ్ పరిస్థితులను మరోమారు తారుమారు చేస్తుందని తాము ఆందోళన చెందుతున్నామన్నారు.
ఇప్పటికీ 130 కోట్ల మంది భారతీయుల్లో సుమారు మూడు శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. అత్యధిక కరోనా కేసులు ఉన్న టాప్ 10 దేశాల్లో వ్యాక్సినేషన్లో భారత్ అట్టడుగున ఉందన్నారు.
జనవరి-మార్చి త్రైమాసికంలో కార్ల విక్రయాలు పుంజుకున్నా.. కోవిడ్-19 రెండో వేవ్తో మళ్లీ లాక్డౌన్లు విధించాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం వినియోగదారుడు ఆచితూచి ఖర్చు చేస్తున్నారని, దీని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుందని అనీశ్ షా వెల్లడించారు.
దేశ కార్ల విక్రయంలో ఆరు శాతం మహీంద్రాదే. దేశంలోకెల్లా ట్రాక్టర్ల ఉత్పత్తిలో అతిపెద్దది. వ్యవసాయ రంగ ఆదాయంలో గ్రోత్ సాధించినా.. మే నెలలో రెండో వేవ్ వల్ల విక్రయాలు పడిపోయాయన్నారు. గ్రామీణ, పట్టణ కొనుగోలు దారులు ప్రస్తుత సంక్షోభం వేళ వెనుకంజ వేస్తున్నారన్నారు.
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
చైనాలో ప్రత్యక్షమైన శ్రీలంక యువరాణి.. మంటలు రేపుతున్న వింత కథనాలు