న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యేలా లేదు. జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కొవిడ్-19 ప్రపంచాన్ని విడిచిపెట్టదని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ శుక్రవారం హెచ్చరించారు.
కనీసం 70 శాతం వరకూ వ్యాక్సినేషన్ ను మనం సాధించగలిగితేనే మహమ్మారి అంతమవుతుందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హాన్స్ క్లగీ పేర్కొన్నారు. యూరప్ లో వ్యాక్సినేషన్లు ఇంకా మందకొడిగానే సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే మహమ్మారి నుంచి బయటపడతామని అన్నారు.