న్యూఢిల్లీ: ప్రజల మనస్సులు చూరగొన్న సోషల్ మీడియా వేదికలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ట్విట్టర్ మినహా సోషల్ మీడియా వేదికలు.. ఇప్పటికైతే కేంద్రం అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఐటీ మంత్రిత్వశాఖకు సమర్పించాయి. అసలు ఐటీ నిబంధనల్లో కేంద్రం ఏం చెబుతున్నది.
దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే పోస్ట్/ ట్వీట్/ కామెంట్కు మూలం ఏమిటో.. అంటే తొలుత దాన్నెవరో పోస్ట్ చేశారో అధికారులు అడిగినప్పుడు చెప్పాలన్నది కేంద్ర ఐటీ తాజా నిబంధనల సారాంశం.
ఇది భావ ప్రకటనాస్వేచ్ఛకు భంగం కలిగించే నిబంధన అని మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాదిస్తున్నది. ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు తలుపులు తట్టిందీ వాట్సాప్. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గించటమే అవుతుందని పేర్కొంది.
అందుకు తాము సిద్ధంగా లేమని వాట్సాప్ స్పష్టంచేసింది. ఐటీ నిబంధనల్లోని 4(2) నియమం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం అని వాట్సాప్ వాదిస్తున్నది.
కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వం, రక్షణ తదితర కీలకాంశాలపైగానీ, ఏదైనా సమాచారం/ ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టుల మూలాలను సదరు సోషల్మీడియాసంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సిందే.
కోవిడ్-19 మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ విధానంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోవిడ్-19 చికిత్స వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై యూపీ సర్కార్.. దేశద్రోహం, రాజద్రోహ కేసులు నమోదు చేసిందని గుర్తు చేసింది.
సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సమ్మతమేనని పేర్కొన్నది. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
భారత రాజ్యంగం ప్రకారం.. నూతన ఐటీ నిబంధనలు పౌరుల వ్యక్తిగత గోప్యత, భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం అని వాదిస్తున్న వాట్సాప్.. తన యూజర్ల డేటా.. తన పేరెంట్ సంస్థ ఫేస్బుక్కు అందజేస్తాం అన్నది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిర్ణయాన్ని అంతర్జాతీయ సెలబ్రిటీలు వ్యతిరేకించారు. మెసేంజర్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా వేదికలకు మళ్లండంటూ పిలుపునిచ్చారు. దీంతో వాట్సాప్ ఒకడుగు వెనక్కు వేసింది. తాజాగా న్యూ ప్రైవసీ పాలసీ అమలులోకి వచ్చింది.
అమెరికా, తదితర సంపన్న దేశాల్లో పౌరుల ఇష్టానికే ప్రైవసీ పాలసీని అమలు చేస్తున్న వాట్సాప్.. భారత్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఈ పాలసీని అమలు చేయొద్దని వాట్సాప్ను కేంద్రం ఆదేశించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐటీ రూల్స్ తు.చ. తప్పకుండా అమలు చేయాలని పట్టుబడుతున్న కేంద్ర ప్రభుత్వానికి పౌరుల వ్యక్తిగత గోప్యత పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు. సర్కార్ను ప్రశ్నిస్తే, దేశ ద్రోహం, రాజద్రోహం అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!