న్యూఢిల్లీ: మే 28: టెలికాం కంపెనీలు వివిధ నగరాల్లో 5జీ ట్రయిల్స్ నిర్వహించడానికి టెలికాం శాఖ ఆయా ఆపరేటర్లకు స్పెక్ట్రం కేటాయించింది. హైదరాబాద్తో సహా ఢిల్లీ, ముంబై, కొల్కాతా, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ ట్రయిల్స్ జరుగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనా కంపెనీల టెక్నాలజీ ఉపయోగించకుండా 5జీ ట్రయిల్స్ నిర్వహణకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా, ఎంటీఎన్ఎల్లు చేసుకున్న దరఖాస్తుల్ని ఇటీవల టెలికాం శాఖ ఆమోదించింది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సిడాట్ టెక్నాలజీలతో ట్రయిల్స్ నిర్వహణకు ఆమోదం లభించింది. రిలయన్స్ జియోఇన్ఫోకామ్ మాత్రం తన స్వంత టెక్నాలజీని ఉపయోగిస్తుంది. 4జీ కంటే 5జీ 10 రెట్లు ఎక్కువ డౌన్లోడ్ స్పీడును, మూడు రెట్లు అధికంగా స్పెక్ట్రం సామర్థ్యాన్ని అందిస్తుందని, ట్రయిల్స్ సందర్భంగా టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయం వంటివాటిని పరీక్షిస్తారని టెలికాం శాఖ తెలిపింది. 6 నెలలపాటు ఈ ట్రయిల్స్ జరుగుతాయి.