న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు కరోనా రెండో వేవ్ దండిగానే గండి కొడుతున్నట్లు కనిపిస్తున్నది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్డర్ పేరు దాదాపు ఖరారు కావాల్సి ఉంది.
కానీ, కరోనా రెండో వేవ్… దాని నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం పూర్తిగా నిమగ్నం కావాల్సిన పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుమానమేనని తెలుస్తున్నది.
దీంతో మహారాజాలుగా పేరొందిన ఎయిరిండియా కొనుగోలు చేసే ఫైనల్ బిడ్డర్ పేరును ఖరారు చేయడం జాప్యం అయ్యేలా కనిపిస్తున్నది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసే సంస్థ పేరును కేంద్రం ప్రకటించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, పూర్తిగా ప్రైవేటీకరణ ద్వారా కేంద్రం రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోవాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ఐపీవో ద్వారా రూ. లక్ష కోట్లు సేకరించాలని కేంద్రం ప్రణాళిక.
ఎయిర్ ఇండియా టేకోవర్ చేసుకునే దిశలో టాటా సన్స్ ముందు వరుసలో ఉన్నట్లు గత నెలలో అధికార వర్గాలు చెప్పాయి. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్తోపాటు ఇతర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. కానీ టాటా సన్స్, అజయ్ సింగ్ బిడ్లు మాత్రమే కేంద్రం ఓకే చేసిందని సమాచారం.
ప్రారంభ టెండర్ గణించిన తర్వాత అర్హులైన కొనుగోలుదారులకు ఎయిర్ ఇండియా వర్చువల్ డేటా రూమ్ (వీడీఆర్)ను కేంద్రం అందజేయనున్నది. దీని ద్వారా కొనుగోలు సంస్థలు తమ ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు పొందే వీలు ఉన్నది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విక్రయం ఫైనాన్సియల్ టెండర్ స్థాయికి చేరుకున్నదని అధికార వర్గాల కథనం.
ఇప్పటికైతే ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసే విషయమై టాటా సన్స్ ఆశాభావంతో ఉంది. కేంద్ర ప్రభుత్వ నూతన ప్రణాళికలో భాగంగా కొవిడ్-19 మహమ్మారిని నియంత్రించడంలో టాటా సన్స్ సహకరిస్తుంది. అయితే, ఈ విషయమై తాము ఇప్పటికైతే ద్రుష్టిని కేంద్రీకరించలేదని టాటా సన్స్ అధికారి ఒకరు చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలను అనుసరిస్తామన్నారు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్కు గానీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పొడిగించామని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మరో మూడు నెలల్లో ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్లను వెల్లడిస్తామన్నారు. అంటే ఎయిరిండియా కొనుగోలు దారు పేరును ఈ ఏడాది ప్రకటిస్తామన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా కొనుగోలు దారును కేంద్రం ప్రకటించనున్నది. కానీ దానిని సదరు సంస్థకు హ్యాండోవర్ చేయడానికి సమయం పడుతుందని అధికార వర్గాల కథనం.
టాటా సన్స్, స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, న్యూయార్క్లోని ఎటర్ప్స్ ఇంక్ జాయింట్ వెంచర్, 209 మంది ఎయిరిండియా మాజీ ఉద్యోగుల గ్రూప్, ఎస్సార్ గ్రూప్, పవన్ రుయా ఆధ్వర్యంలోని డన్లప్, ఫాల్కన్ టైర్స్ కూడా ఈవోఐ దాఖలు చేశాయి.
20 ఏండ్లుగా ఎయిర్ ఇండియా ప్రైవేటీకరించడానికి కేంద్రం ప్రయత్నిస్తూనే ఉంది. అప్పట్లో 20 శాతం వాటా విక్రయానికి పెట్టింది. 2017లో 74 శాతం వాటాను విక్రయించడానికి కేంద్రం పచ్చ జెండా ఊపినా.. టేకోవర్ చేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. దీంతో తాజా ప్రతిపాదనల్లో పూర్తిగా విక్రయించడానికి నిర్ణయించింది.
ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు.. నిపుణులు కూడా..!
Corona టైం..పరిమళించిన మానవత్వం: అంబులెన్స్ డ్రైవర్గా ఎన్నారై
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ ఎఫ్డీ కన్నా బెటర్
పరపతికి గీటురాయి సిబిల్ స్కోర్
సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!
బంగారం vs క్రిప్టో కరెన్సీ.. పెట్టుబడికి ఏది బెస్ట్? గోల్డ్కే ఇండియన్ల మొగ్గు!!
అక్షయ తృతీయకు డిమాండ్ లేకున్నా.. పెరిగిన బంగారం దిగుమతులు