Loksabha Polls 2024 : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన అనంతరం బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ మళ్లీ అదే సంతుష్టీకరణ, బుజ్జగింపు రాజకీయాలను పునరావృతం చేసిందని చెప్పారు. దేశాన్ని విభజించే పర్సనల్ లాను ముందుకు తీసుకెళతామని కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టం చేసిందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా పేర్కొన్నారు.
పేదల అభ్యున్నతి, దేశ పురోగతికి కట్టుబడి ఉండే పార్టీని ఆదరించాలని తాను ఓటర్లను అభ్యర్ధిస్తున్నానని ఆయన చెప్పారు. దేశాన్ని షరియా ప్రకారం ముందుకు తీసుకువెళతారా అని రాహుల్ గాంధీని అమిత్ షా ప్రశ్నించారు. మన రాజ్యాంగం లౌకిక పునాదులపై ఏర్పడిందని, మత ప్రాతిపదికన మన చట్టాలు రూపొందవని స్పష్టం చేశారు.
ఉమ్మడి పౌర స్మృతి తీసుకువస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. తాము ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి యూసీసీని చేపట్టామని, దీన్ని తాము ముందుకు తీసుకెళతామని షా తేల్చిచెప్పారు. దేశాన్ని విభజించే పర్సనల్ లా గురించి రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో వ్యక్తిగత చట్టాలను అమలు చేయలేమని, నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపడతారని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :