న్యూఢిల్లీ: కరోనా ప్రభావం ఉన్నా దేశంలోకి గతేడాది బంగారం దిగుమతులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో పసిడి దిగుమతులు 22.58 శాతం ఎక్కువయ్యాయి. అంటే దాని విలువ దాదాపు రూ.2.54 లక్షల కోట్లు (34.6 బిలియన్ డాలర్లు) అన్న మాట. దేశీయంగా గిరాకీ పుంజుకోవడం వల్లే బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.
పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత కరెంటు ఖాతా లోటు (క్యాడ్) పై నేరుగా ప్రభావం చూపేది బంగారమే. పసిడి దిగుమతులు పెరిగినా 2019-20లో 161.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు.. 2020-21లో 98.56 బిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం.
రానున్న అక్షయ తృతీయ, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో బంగారం దిగుమతులు మరింత పెరిగి కరెంటు ఖాతా లోటుపై ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పసిడికి భిన్నంగా వెండి దిగుమతులు భారీగా 71 శాతం తగ్గాయి. దిగుమతి చేసుకున్న వెండి విలువ 791 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలే ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి.
ఇక గత ఆర్థిక సంవత్సరం జెమ్స్ అండ్ జెవెల్లరీ ఎగుమతులు 27.5 శాతం తగ్గి 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..