న్యూఢిల్లీ : కొవిడ్-19 మూడో వేవ్ త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నదని మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్యా ఠాక్రే అన్నారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సెకండ్ వేవ్ కంటే బలంగా లేదా బలహీనంగా ఉంటుందో చెప్పలేమన్నారు. ప్రస్తుతం కొవిడ్ నివారణకు వ్యాక్సిన్లు సహాయపడకున్నా.. భవిష్యత్ కోసం సిద్ధం కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.
మేం గత సంవత్సరం సృష్టించిన టాస్క్ ఫోర్స్ మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, సైన్స్, వైద్య వాస్తవాల ప్రకారం కానీ, రాజకీయాల ద్వారా కాదని మహారాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యా థాకరే పేర్కొన్నారు. ఎన్డీటీవీ సొల్యూషన్స్ సమ్మిట్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.
‘మహారాష్ట్రలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటున్నది. పలు హాటళ్లను దవాఖానలుగా మార్చి వైద్యం అందిస్తోంది. ప్రస్తుతం మా ప్రభుత్వం థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండటంతో దాని కోసం సన్నద్ధమవుతున్నాది. మాకు ఐదు లక్షల పడకల వరకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 70 శాతం ఆక్సిజనేషన్ ఉన్నాయి’ అని ఆదిత్యా ఠాక్రే చెప్పారు.
కరోనా మహమ్మారి కారణంగా దేశంలోనే అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉన్నది. నిన్నటి వరకు 67,123 కొత్త కేసులు నమోదయ్యాయి. 419 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం సంఖ్య 37.7 లక్షలు, దాదాపు 60 వేల మరణాలకు చేరుకుంటున్నది.
ఈ మహమ్మారి తీవ్రంగా ఉన్నందున భయపడవద్దని ప్రభుత్వం అక్కడి ప్రజలను కోరింది. ఈ వ్యాధి నెలరోజులుగా మ్యుటేషన్ చెంది మరింత క్లిష్టంగా మారింది.
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..