హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ(TSRTC) లహరి బస్సులో ప్రయాణికుల బ్యాగులు( Passengers bags) చోరీకి(Stolen) గురవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..టీఎస్ ఆర్టీసీ లహరి బస్సులో(Lahari bus) ప్రయాణికులు షిరిడి నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. మియాపూర్లో బస్సు దిగి చూసే సరికి బ్యాగులు మాయమయ్యాయి. బ్యాగుల్లో సెల్ ఫోన్లు, నగదు ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.