Committed suicide,Pond , Sirisilla district,Telangana
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త (22) అనే యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఇదే క్రమంలో ఆదివారం ఉదయం వేకుమ జామున గ్రామ శివారులో గల జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లవన్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.