న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులకు గొప్ప రిలీఫ్. కరోనా వేళ తన సబ్స్క్రైబర్లకు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. సబ్స్క్రైబర్లు తమ ఈపీఎఫ్ డిపాజిట్ల నుంచి మరో దఫా నాన్-రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఆదివారం జరిగిన ఈపీఎఫ్వో గవర్నింగ్ బాడీ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనా (పీఎంజీకేవై) కింద గతేడాది మార్చిలో కరోనా మహమ్మారి వేళ.. ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఈపీఎఫ్ డిపాజిట్ల నుంచి ప్రత్యేక విత్డ్రాయల్స్కు నిబంధన జత చేసింది.
ఈ నిబంధన కింద తమ సబ్స్క్రైబర్ల మూడు నెలల కనీస వేతనం ప్లస్ కరువు భత్యం/ ఈపీఎఫ్ ఖాతాలో సభ్యుడి క్రెడిట్లో 75 శాతంల్లో ఏది తక్కువైతే దాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
నెలసరి వేతనం రూ.15 వేల లోపు ఉన్న ఈపీఎఫ్ సభ్యులకు కరోనా మహమ్మారి వేళ కోవిడ్-19 అడ్వాన్స్ గొప్ప సహాయకారిగా ఉంటుంది. ఇప్పటివరకు కోవిడ్-19 అడ్వాన్స్ కోసం 76.31 లక్షల క్లెయిమ్లకు పైగా ఆమోదించింది. దీని కింద రూ.18,698.15 కోట్లు పంపిణీ చేసింది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్తోపాటు బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా కేంద్రం ప్రకటించింది. కనుక తమ సభ్యులు తొలిదఫా కోవిడ్-19 అడ్వాన్స్ మాదిరిగానే రెండో దఫా అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ అడ్వాన్స్ టైంలో మాదిరే ఇప్పుడు విత్డ్రాయల్స్ కోసం ప్రాసెస్ చేసుకోవాలి.
ఇందుకోసం ఈపీఎఫ్వో ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ పేరిట ఒక వ్యవస్థను రూపొందించింది. సభ్యులు కేవైసీ సమర్పించిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మామూలుగా ఈ క్లెయిమ్లను ఆమోదించడానికి 20 రోజులు పడుతుంది.
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్పై త్వరలో స్టడీ
కరోనా చికిత్స: రూ.5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్లు!
ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు