ముంబై: ఇక నుంచి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులు, అధికారులు సేవలందించడం కత్తిమీద సాము కానున్నది. బ్యాంకుల్లో అవకతవకలను నియంత్రించడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్లో భాగంగా సున్నితమైన డేటా కలిగి ఉన్న బ్యాంక్ అధికారులను ఏడాదిలో ఒకసారి కంపల్సరీ లీవ్పై పంపుతారు. ఈ నిర్ణయం అకస్మాత్గా తీసుకుంటారు.
త్త్రి నియంత్త్రి
తమ అధికారులకు కంపల్సరీ లీవ్ విధానాన్ని అమలు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ కోరింది. దీని ప్రకారం సంబంధిత బ్యాంకులు.. సున్నిత సమాచారం గల అధికారులను అకస్మాత్గా 10 రోజులు సెలవులో పంపాల్సి ఉంటుంది. ముందస్తుగా అధికారులకు బ్యాంకులు సమాచారం ఇవ్వవు.
బ్యాంకుల్లో అధికారులకు కంపల్సరీ లీవ్ అమలు చేయాలన్న నిబంధన కొన్ని సెక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యేకించి ట్రెజరీ, కరెన్సీ, రిస్క్ మోడలింగ్ తదితర విభాగాల్లో సీనియర్లుగా ఉన్న వారికే ఈ రూల్ అమలులోకి వస్తుంది.
అధికారులు కంపల్సరీ సెలవులో ఉన్నప్పుడు బ్యాంకును సందర్శించడం గానీ, ఆన్లైన్లో లావాదేవీలను పొందడం గానీ చేయొద్దు. ఈ నిబంధన అమలు చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ ఆరు నెలల గడువు పెట్టింది.
కొన్నిబ్యాంకుల్లో ఇప్పటికే ఇటువంటి నిబంధనలు అమలులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకుల్లో అమలులో ఉన్న పద్దతి ఇది. ఏదైనా ఉద్యోగి అవకతవకలకు పాల్పడితే, ఆయన పరోక్షంలో నిర్ధారించడానికి వీలుగా కంపల్సరీ లీవ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
పులిని వెంబడించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
6 ఏళ్ల బాహుబలి… ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కప్పా వేరియంట్ గురించి ఏమీ చెప్పలేం : వైద్య నిపుణులు
రూ.10 లక్షల లోపు బెస్ట్ డీజిల్ కార్లు ..
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!
Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!