న్యూఢిల్లీ: 4జీ సంచలనం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్తో కలిసి చౌకధరలో స్మార్ట్ఫోన్ తీసుకొచ్చేందుకు సెర్చింజన్ గూగుల్ ప్రయత్నిస్తున్నది. చౌకగా స్మార్ట్ఫోన్ తయారీ ప్రాజెక్ట్ కొనసాగుతున్నదని గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజలందరికీ అందుబాటు ధరలో ఫోన్ తయారీపై దృష్టిపెట్టాం. శరవేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా భాగస్వామి జియోతో కలిసి పనిచేస్తున్నాం’ అని అన్నారు.
మార్కెట్లోకి ఎప్పుడు ఆ స్మార్ట్ఫోన్ విడుదల అవుతుంది, దాని ధర, డేటా రేట్లు తదితర వివరాలను మాత్రం పిచాయ్ బహిర్గతం చేయలేదు. రిలయన్స్ జియో ప్లాట్ఫాంలో గూగుల్ భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.
రూ. 33,737 కోట్లు చెల్లించి జియోలో 7.7శాతం వాటాను గూగుల్ సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే చౌక ధరలో ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ తయారు చేస్తామని రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి.
‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్’ పేరుతో వచ్చే ఏడేండ్లలో భారత్లో రూ. 75వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు పిచాయ్ గతేడాది జులైలో ప్రకటించారు. ఇందులో భాగంగానే జియోలో వాటాను గూగుల్ కొనుగోలు చేసింది.
నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?
ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం పదిలం
వ్యాక్సినేషన్ తోనే ఎకానమీపై మహమ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ
వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!
హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ప్రధాని పర్యటన
ఐటీ కొత్త రూల్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ సంస్థ
మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
నన్నెవరూ అరెస్ట్ చేయలేరు : రాందేవ్ బాబా
యాంటీబాడీ కాక్టెయిల్ ట్రయల్స్కు జైడస్ దరఖాస్తు
భారతీయ ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నాం : గూగుల్ సీఈవో
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు