న్యూఢిల్లీ: కరోనా వేళ తమ ఖాతాదారులకు అండగా నిలిచేందుకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎప్సీ బ్యాంక్ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా 19 నగరాల పరిధిలో మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చింది. అయితే, మీరు ఫేస్ మాస్క్ ధరించి, శానిటైజ్ చేసుకుంటేనే మనీ విత్ డ్రాయల్ చేసుకోగలరు.
మొబైల్ ఏటీఎంల ఏర్పాటుకు సంబంధించి హెచ్డీఎప్సీ బ్యాంకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. ఏటీఎం లోకేషన్ పేరు ఈ వీడియోలో వినిపిస్తుంది. ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణె, లక్నో, ఢిల్లీ, లుధియానా తదితర నగరాల్లోని వివిధ ప్రాంతాల పేర్లు వచ్చాయి.
కొవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రత్యేకించి కంటైన్మెంట్ జోన్లో ఈ మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేసింది హెచ్డీఎప్సీ బ్యాంక్. కంటైన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలు బయటకు వెళ్లడానికి పూర్తిగా ఆంక్షలు అమలులో ఉంటాయి.
గతేడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో కూడా మొబైల్ ఏటీఎం కేంద్రాలను హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్వహించింది. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 14 వేల ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. స్థానిక అధికారులతో మాట్లాడిన తర్వాతే హెచ్డీఎప్సీ బ్యాంకు ఈ మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేస్తుంది. కొన్ని చోట్ల తాను నిర్ణయాలు తీసుకుంటుంది.
మొబైల్ ఏటీఎం నడిపే వ్యాన్ ను బ్యాంకు పూర్తిగా శానిటైజ్ చేస్తుంది. అలాగే ఈ ఏటీఎంల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బంది సామాజిక దూరం పాటించడంలోనూ మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకోవడంలోనూ ముందు ఉంటారు. మాస్కులు ధరించిన వారికి మాత్రమే డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
మామూలు ఏటీఎంల్లో మాదిరిగా మొబైల్ ఏటీఎంలలోనూ డబ్బు అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఏటీఎంల్లో రోజుకు 100-150 లావాదేవీల వరకు నిర్వహించొచ్చు. గతనెలతో ముగిసిన చివరి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.8,434 కోట్ల నికర లాభం గడించింది.
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
మళ్లీ గరీబ్ కల్యాణ్ యోజన: రెండు నెలలు పేదవాడికి 5 కిలోల బియ్యం ఫ్రీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్టీవీని ఆవిష్కరించిన షియోమీ
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ