సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు కొత్త కాదు. ఆయన సినిమాలే కాదు పాటలు, పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ గతంలో పలు రికార్డ్స్ సృష్టించాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సాంగ్ శ్రోతలను ఎంతో అలరించింది. వీడియో సాంగ్ కూడా ఆకట్టుకుంది.
తాజాగా మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి మహేష్ కెరీర్ లో మరో 100 మిలియన్ వీడియోగా నిలిచింది. ఈ సాంగ్లో మహేష్, రష్మికల పర్ఫార్మెన్స్ కూడా ఈ పాటకు ఇంత క్రేజ్ రావడానికి కారణం అని చెప్పవచ్చు. సరిలేరు నీకెవరు చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది . కాగా, మహేష్ మరోసారి వింటేజ్ ట్రీట్ ఇచ్చేందుకు “సర్కారు వారి పాట” అనే మాస్ ప్లిక్ చేస్తున్నాడు. పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..