మల్కాన్గిరి : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సబ్ ఇన్స్పెక్టర్ మురళి తాతీని కాల్చి చంపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పుల్సుమ్పారా వద్ద పడేసి వెళ్లారు. గంగలూర్లో పని చేస్తున్న మురళి సెలవులో ఉండగా.. బీజాపూర్ జిల్లాలోని తన గ్రామం పల్నూర్లో గత బుధవారం అపహరణకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, గోండ్వానా సమాజ్ కమిటీ ఆయన విడుదల కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే బంధీగా ఉన్న మురళిని మావోయిస్టుల హత్య చేశారు. మృతదేహం వద్ద బస్తర్ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ లభ్యమైంది. మురళి హత్యను ఇంకా పోలీసులు ధ్రువీకరించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవికూడా చదవండి..