KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇవాళ ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
కొద్దిసేపటి క్రితమే జిల్లాలోని జడ్చర్లకు చేరుకున్న ఆయన.. అప్పనపల్లి, ఏనుగొండ మీదుగా గడియారం కూడలికి చేరుకుంటారు. గడియారం కూడలిలో కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. కేసీఆర్ 17రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోకసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు (Road show) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు.
జడ్చర్లలో కేసీఆర్కు హారతి పట్టి స్వాగతం పలికిన మహిళలు. pic.twitter.com/gGzF7lM7En
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2024