బడంగ్పేట్, ఆగస్టు 16: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేయకుండా ఆటంకాలు కల్గిస్తున్నారని పేర్కొన్నారు. పేదింటి ఆడ్డ బిడ్డల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారారూ.1.16క్షలు అందజేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కుల పంపిణీకి అడ్డంకులు సృష్టించడానికి కోర్టులో స్టే తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, సరూర్నగర్ మండలాల పరిధిలో ధర్నా కార్యక్రమాలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె కోరారు.