(Pawan Kalyan) విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒంటికాలుపై లేచాడు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కేంద్ర ప్రభుత్వం వీఎస్పీ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి తూర్పారబట్టారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగం చేస్తామని అధికార పార్టీ చేసిన నినాదాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
‘విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు. అంత త్యాగాలు అక్కర్లేదు. కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు’ అంటూ వైసీపీ ఎంపీలకు పవన్ కల్యాణ్ చురకలంటించారు. అంతకుముందు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంబంధించి పార్లమెంట్లో ప్ల కార్డులు ప్రదర్శించాలని వైసీపీ, టీడీపీ ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ వీడియో ఒకదాన్ని ఆయన విడుదల చేశారు. అఖిలపక్షాన్ని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్తే మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల వాణిని పార్లమెంటుకు తీసుకెళ్లాలని వైసీపీ ఎంపీలను డిమాండ్ చేశారు.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..