అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచోసుకుంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో ఓ హోంగార్డు భార్య మృతిచెందింది. గొల్లపూడిలోని మౌలానగర్కు చెందిన హోంగార్డు వినోద్ కుమార్.. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అదనపు ఎస్పీ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి విధులు ముగించుకున్న తర్వాత ఎస్పీ ఇంటి నుంచి కూరగాయలతోపాటు పొరపాటున తుపాకీని కూడా తీసుకొని వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తుపాకీని గమనించిన వినోద్.. దానిని బీరువాలో పెట్టమని తన భార్య సూర్యరత్నప్రభకు ఇచ్చాడు. ఈ క్రమంలో అది మిస్ఫైర్ కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..