UAE-Iran : ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ పొరుగునే ఉన్న యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో ఉన్న అన్ని వ్యాపార, వాణిజ్య ఒప్పందాల్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. తాజా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమపై వరుసగా మిస్సైల్ దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది. ‘‘యూఎస్-ఇరాన్ యుద్ధం కారణంగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య, వ్యాపార, ఆర్థిక ఒప్పందాల్ని రద్దు చేసుకుంటున్నాం.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలవుతుంది’’ అని ఇరాన్ విదేశాంగా శాఖ ప్రకటించింది. ఇరాన్ వరుసగా చేస్తున్న మిస్సైల్ దాడులే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణం. యూఏఈ సహా గల్ఫ్ దేశాలకు చెందిన షిప్పింగ్ రూట్లపై ఇరాన్ వరుసగా బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేస్తోంది. అయితే, యూఏఈలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని గుర్తించి ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా ఒక మిస్సైల్ యూఏఈ సరిహద్దు జలాల్లో పడగా, ఇంకోటి దేశంలోనే పడింది. తమ నౌకా మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడికి దిగిందని యూఏఈ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయెలి బకాయే ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇవి ఆధారం లేని ఆరోపణలు అని, వీటివల్ల ప్రాంతీయ విశ్వాసం దెబ్బతింటుందని ఎస్మాయెలి అన్నారు.
مديرة الاتصال الإستراتيجي في وزارة الخارجية: وقف جميع الأنشطة والتبادلات التجارية والمعاملات المالية مع إيران
Director of the Strategic Communications Department at MoFA: All Trade, Commercial Exchange, and Financial Transactions with Iran Halted pic.twitter.com/PQczXyDNRX
— MoFA وزارة الخارجية (@mofauae) August 18, 2026
ఈ అంశంపై యూఏఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే అక్కడి ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. మిస్సైల్ దాడికి అవకాశం ఉందని, ప్రజలు సురక్షితంగా ఇండ్లలోనే ఉండాలని ఆ అలర్ట్ సారాంశం. అయితే, కొంతసేపటికే ఆ అలర్ట్ను అధికారులు ఎత్తివేశారు. మరోవైపు హార్ముజ జలసంధి విషయంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. అమెరికాతో ఒప్పందం కుదిరే వరకు జలసంధి మూసి ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. అయితే, జలసంధి తమ ఆధీనంలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.