ఉన్నావ్, ఏప్రిల్ 11: ఎన్నికలంటే ఓటర్లకు డబ్బులు, కానుకలు పంచడం తెలుసు! అవి అధికారులకు పట్టుబడుతుండటం కూడా చూశాం! కానీ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోని హసన్గంజ్ గ్రామంలో అధికారులు 200 కేజీల జిలేబీ, 1,050 సమోసాలు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచడానికి ఓ అభ్యర్థి ఈ స్వీటూ హాటు తయారుచేయించాడు. వాటితో పాటు వంటగ్యాస్ సిలిండర్లు, పిండి, నెయ్యిని కూడా అధికారులు సీజ్ చేసి పట్టుకెళ్లారు.