న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్తో తల్లడిల్లుతున్న మహారాష్ట్రలో మరోమారు లాక్డౌన్ విధించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎనిమిది రోజుల లాక్డౌన్ విధించాలని భావిస్తున్నారు. కానీ కొవిడ్-19 టాస్క్ఫోర్స్ మాత్రం రెండు లేదా మూడు వారాలు లాక్డౌన్ విధించాలని సిఫారసు చేసినట్లు సమాచారం.
కొవిడ్ టాస్క్ఫోర్స్ సిఫారసులపై సోమవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆరోగ్యశాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో మరోమారు సమీక్షించనున్నారని తెలుస్తున్నది. ఆదివారం కొత్తగా 9,989 కరోనా కేసులు రికార్డు కాగా, 58 మంది మరణించారు.
కొవిడ్ టాస్క్ఫోర్స్తో భేటీ తర్వాత రాష్ట్ర మంత్రి అస్లాం షేక్ స్పందిస్తూ.. లాక్డౌన్ రెండు వారాలు విధించాలని కొందరు, మూడు వారాలు విధించాలని కొందరు సూచించారన్నారు. లాక్డౌన్ అమలు చేయడానికి మార్గదర్శకాలను ఖరారు చేయాల్సి ఉందన్నారు.
కొద్దిరోజులుగా వివిధ రంగాల ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు శనివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలు సీఎంకు హామీ ఇచ్చాయి.
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన