వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. మంగళవారం నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన జె.లోకేశ్వర్ అనారోగ్య సమస్య రాగా వారి కుమారుడు గంగాధర్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 60వేలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దూర దృష్టితో వైద్య రంగంలో అనేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేద ప్రజల అనారోగ్యానికి భరోసాను ఇస్తున్నాయన్నారు. అడగగానే సీఎంఆర్ఎఫ్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మద్యం డోర్ డెలివరీ చేస్తానంటూ మోసం
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర