జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగాగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయన్నారు. కల్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖానలో కావాల్సిన సిబ్బంది దాదాపు నలభై మందిని నియమించడానికి జీవో విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి