కొల్లాపూర్/ నాగర్ కర్నూలు : జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం జరగాలని, ఇది కొల్లాపూర్ ప్రజల చిరకాల కోరిక కూడా అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎన్నికల హామీగా పేర్కొన్న సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే సాకారం అవుతుందని ఆయన అన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యేగా విజయం సాధించి నప్పటి నుంచి కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర వంతెన నిర్మాణం అయితే వెనుకబడ్డ కొల్లాపూర్ ప్రాంతం రవాణా, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చెందుతుందని అసెంబ్లీలో ప్రస్తావించానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి పలు మార్లు సమస్య తీసుకెళ్లి విజయం సాధించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేశారని బీరం తెలిపారు. గత ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించి సోమశిల, సిద్ధేశ్వరం వంతెన నిర్మాణంతో పాటు జాతీయ రహదారి మంజూరు చేస్తూ జాతీయ రహదారిపై 167 k నెంబరు కూడా అలాట్ మెంట్ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ఈ జాతీయ రహదారి, వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 610 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర